
అభ్యర్థిగా వచ్చి.. ఉద్యోగంలోకి..
అజ్ఞానపు చీకట్లను తొలగించడమే కాదు, యువతను దురలవాట్లకు దూరంగా ఉంచి వారిలోని అద్భుతమైన శక్తి సామర్థ్యాలను వెలికి తీయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న ప్రయత్నంలో మనం ఘనమైన విజయం సాధించాం. దీనికి నిదర్శనం.. లైబ్రరీ వనరులను ఉపయోగించుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతే. ఉపాధ్యాయులుగా, సబ్ ఇన్ స్పెక్టర్లుగా, పోలీస్ కానిస్టేబుళ్లుగా , మిగతా రాష్ట్ర, కేంద్ర ఉద్యోగాలకు 33 మంది యువతీ యువకులు ఎంపికయ్యారు. దూడం పవన్ కు బీబీసీలో జర్నలిస్ట్ గా ఉద్యోగం వచ్చింది. యువతలో దాగి ఉన్న ప్రతిభ, సామర్థ్యాలను వెలికితీసి మంచి మానవ వనరుగా తీర్చిదిద్గే ప్రయత్నానికి ఈ విజయాలు మనల్ని మరింత ఉత్సాహంగా పని చేయడానికి ఉత్ప్రేరకాలవుతాయి.

కనిపించే విజయాలు
గ్రంథాలయం - సాహితీ పీఠం విజయాలు
హనుమకొండ జిల్లాలోని మారుమూల ప్రాంతమైన భీమదేవరపల్లి మండలం ముల్కనూరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో గ్రామ పూర్వ విద్యార్థులు ప్రజాగ్రంథాలయాన్ని 2014లో ఏర్పాటుచేశారు. దీనికి ప్రజాప్రతినిధులు చేయూతనందించారు. కేవలం పుస్తకాలే కాకుండా డిజిటల్ వ్యవస్థగా రూపాంతరం చెంది ఈ ప్రాంత విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించే గనిగా మారి నిత్యం వందలాది మందితో కిటకిటలాడుతున్నది.
01
Program
01
Program
01
Program
01
Program
01
Program
01
Program
ప్రజా గ్రంథాలయం
దేశవ్యాప్తంగా తెలుగు కథా రచయితలను ప్రోత్సహించే వేదిక ముల్కనూరు సాహితీ పీఠం. ఇందులో భాగంగా ‘నమస్తే తెలంగాణ దినపత్రిక-ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా 2019 నుంచి కథల పోటీలు నిర్వహిస్తోంది.

KATAKAM RAJKUMAR
S/o: K. Ashok
Village : Kothapally
Selected post :
SGT TEACHER (MPPS Vangara Vangara)(2024)

Gundla Sridhar
Village: Mulkanoor
Selected posts:
1.Junior Lecturer MJPTGBC Gurukulam
2.Trained Graduate Teacher TGSWR Gurukulam
3.Junior Lecturer TSPSC for Govt.Junior Colleges
(2024)

ERRAGOLLA SURENDER
S/0: Erragolla Sammaiah
Village : Kothapally
Selected Post :
NURSING OFFICER MGM HOSPITAL WARANGAL
(2024)

Arakala Shiva
Village : Koppur
Selected Post :
police constable(civil)
(2024)

Thalllapally Sampath
S/0: Kailasam
Village : Koppur
Selected Post :
Secondary grade teacher MPPS Gatlanarsingapoor
(2024)

Ganji Sairaj
S/0: Rajamouli
Village : Mulkanoor
Selected Post :
Police constable(civil)
(2024)

DONDA RAJU
S/0: Ravindhar
Village : Mulkanoor
Selected Post :
-
Multi Tasking Staff Grade III PGIMER Chandigarh 2023
-
Multi Tasking Staff Grade III AIIMS Bhopal(MP) 2024
-
Multi Tasking Staff Grade III AIIMS Mangalagiri(AP) 2025

Adulapuram
Rishi Varma
S/0: Mohan
Village : Mulkanoor
Selected Post :
Group 4 (Junior Assistant) - Revenue Department (CCLA) (2024)

Sathuri Prashanth
S/0: Powlu
Village : Bheemadevarapalle
Selected Post :Field officer in Rubber Board at Muvattupuzha Kerala
Selected year: August 2025

Donda Divya
S/0: Ravinder
Village : Mulkanooru
Selected Post : police constable(civil) 2024
ప్రభుత్వ సర్వీసులోకి..

కథా విజేత లు...
మనం అనుకున్న గమ్యానికి ఒక్క సంవత్సరమైనా చేరుతామా? లేదా? అనే మీమాంస నుంచి ఐదు సంవత్సరాలు సాగిన అందమైన కథా ప్రయాణం మాకు గొప్ప సంతృప్తినిస్తుంది. ఈ కథల పోటీల్లో సుమారు 250 నుంచి 300 మంది కథా రచయితలను విజేతలుగా ప్రకటించాం. ముల్కనూరు సాహితీ పీఠం ప్రారంభించిన ఈ క్రతువును రచయితలే యాజ్ఞికులుగా, పాఠకులే యజమానులుగా ముందుకు సాగిస్తున్నారు. భవిష్యత్తులో ఈ కథా కేంద్రం ద్వారా మరింత మంది విజేతలను తెలుగు సాహిత్య ప్రపంచానికి పరిచయం చేసేందుకు మా ప్రయత్నం కొనసాగుతుంది.
01
Program
01
Program
01
Program
01
Program
01
Program
01
Program
సాహితీ పీఠం
దేశవ్యాప్తంగా తెలుగు కథా రచయితలను ప్రోత్సహించే వేదిక ముల్కనూరు సాహితీ పీఠం. ఇందులో భాగంగా ‘నమస్తే తెలంగాణ దినపత్రిక-ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా 2019 నుంచి కథల పోటీలు నిర్వహిస్తోంద ి.
నమస్తే - ముల్కనూర్.. కథోత్సవం!
కథలకు పట్టం... రచయితలకు ఎనలేని ప్రోత్సాహం

కథ 2025
జాతీయ స్థాయి కథల పోటీ..
ఈ కథల వ్రతంలో.. ఓ రచయితది చెలియలికట్ట దాటని ఆవేశం మరో కథకుడిది కట్టలు తెంచుకున్న ఆవేదన.. ఆలోచనలకు రెక్కలు తొడిగింది ఒకరైతే .. ఆప్యాయతలకు పెద్దపీట వేసింది మరొకరు! ఈ పోటీ క్రతువులో.. అందరూ అందరే.. అక్షరాన్ని ఉపచారంగా ఎ ంచుకున్నవారే! భాషయాసలను నివేదనగా అర్పించినవారే!! కథల పోటీ 2025 కు వెల్లువలా వచ్చిన వందలాది కథలను విశ్లేషించి.. అనేక దశల్లో వడబోసి.. అత్యుత్తమ కథలను ఎంపిక చేయనైనది.

కథ 2023-24
ఐదు వసంతాల పవిత్ర క్రతువు..
మనం అనుకున్న గమ్యానికి ఒక్క సంవత్సరమైనా చేరుతామా? లేదా? అనే మీమాంస నుంచి ఐదు సంవత్సరాలు సాగిన అందమైన కథా ప్రయాణం మాకు గొప్ప సంతృప్తినిస్తుంది. ముల్కనూరు సాహితీ పీఠం నమస్తే తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ క్రతువుకు రచయితలే యాగ్నికు లు. పాఠకులే యజమానులు. తెలుగు కథ తల్లికి మకుటాన్ని తొడగడం మాకు దక్కిన అదృష్టం. ఇది మాకెళ్లప్పుడూ చెప్పలేని ఆనందం.

కథ 2022
ప్రతిష్టాత్మక కథోత్సవం
2019 నుంచి ములుకనూర్ ప్రజా గ్రంథాలయం, నమస్తే తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్న వార్షిక కథల పోటీల్లో నాలుగవది. ఈ పోటీలో 70 కథలు బహుమతులకు ఎంపికైనాయి.

కథ 2021
నమస్తే తెలంగాణ - ముల్కనూరు కథల పోటీ
ఏటా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి కథల పోటీల్లో ఇది మూడవది. 64 కథలు విజేతగా నిలిచాయి. ఈ పోటీకి పెద్దింటి అశోక్ కుమార్, గింజల మధుసూదన్ రెడ్డి, దేవారాజు విష్ణు వర్ధన్ రాజు, కొమఱ్ఱాజు అనంత కుమర్, కోడూరి విజయ కుమార్, గోగు శ్యామల మొదలైనవారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

కథ 2020
జాతీయ స్థాయి కథల పోటీ
2019 నుంచి ములుకనూర్ ప్రజా గ్రంథాలయం, నమస్తే తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్న వార్షిక కథల పోటీల్లో రెండవది. ఇందులో 50 కథలు బహుమతులకు ఎంపికైనాయి. ఈ పోటీకి నాళేశ్వరం శంకరం, జూపాక సుభద్ర, ఎగుమామిడి అయోధ్యారెడ్డి, కె. అనంత కుమార్, గింజల మధుసూదన్ రెడ్డి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

కథ 2019
జాతీయ స్థాయి కథల పోటీ..
ములుకనూర్ ప్రజా గ్రంథాలయం, నమస్తే తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్న కథల పోటీల్లో ఇది మొదటిది. 22 కథలు బహుమతులకు ఎంపిక య్యాయి. మధుసూదన్ రెడ్డి, కోడూరి విజయకుమార్, పెనుగొండ బసవేశ్వర్, నగేష్ బీరెడ్డి , ఇట్టేడు అర్కనందనాదేవి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.