top of page
Image by Nayan Bhalotia

శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి
ముల్కనూర్‌ పీఠనిలయే సరస్వతి నమోస్తుతే.

dyana mandhiram.jpg
Untitled design.gif

శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి
ముల్కనూర్‌ పీఠనిలయే సరస్వతి నమోస్తుతే.

పుష్పాభిషేకం

    గంట
   కొట్టండి

ai-generated-diwali-candle-set-isolated-on-transparent-background-free-png.webp
ai-generated-diwali-candle-set-isolated-on-transparent-background-free-png.webp
mulkanoor sahithi  peetam.jpg

ABOUT US

సాహితీ సేవలో

ముల్కనూరు ప్రజా గ్రంథాలయం ప్రధాన సలహాదారు శ్రీ వేముల శ్రీనివాసులు తన మిత్రులతో తెలుగు సాహిత్యం, ముఖ్యంగా కథా సాహిత్యం గురించి చర్చించినప్పుడు తెలుగు కథను, కథా రచయితలను ప్రోత్సహించాలని అలాగే కొత్త రచయితలను గుర్తించాలని అనుకున్నారు. అందుకోసమై నమస్తే తెలంగాణ దినపత్రిక సంపాదకులు శ్రీ కట్టా శేఖర్ రెడ్డి గారిని సంప్రదించగా ఆయన తాము కూడా ఇలాంటి ఆలోచనే చేస్తున్నట్టు చెప్పారు. తెలుగు కథకు కొత్త వెలుగులు తీసుకురావాలని నిశ్చితాభిప్రాయానికి వచ్చి ముల్కనూరు సాహితీ పీఠం వారు, నమస్తే తెలంగాణ వారు సంయుక్తంగా కథల పోటీలను నిర్వహించి గణనీయమైన బహుమతులను ఇవ్వాలని, తద్వారా తెలుగు కథా రచయితలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. అలా 2019 లో   మొదలైన కథల పోటీలు  ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. ఈ పోటీలలో బహుమతులు సాధించిన కథలు  నమస్తే తెలంగాణ  ఆదివారం అనుబంధం ‘బతుకమ్మ’లో ప్రచురితం అవుతున్నాయి. దీంతోపాటు  బహుమతి పొందిన కథలతో  ప్రతి సంవత్సరం ముల్కనూరు సాహితీ పీఠం ఆధ్వర్యంలో  కథా సంకలనం కూడా వెలువడుతోంది. 
ప్రజా గ్రంథాలయం – సాహితీ పీఠం ఆధ్వర్యంలో రూ.50,000 ల ప్రథమ బహుమతి, రూ.25,000 -ల ద్వితీయ బహుమతులు రెండు,  రూ.10,000/- –ల తృతీయ బహుమతులు కనీసం మూడు, కనీసం ఆరు కథలకు రూ .5000/–-ల చొప్పున విశిష్ట బహుమతులను ఇవ్వడం జరుగుతున్నది. ఇవేకాక గణనీయమైన సంఖ్యలో కథలను ఎంపిక చేసి రూ. 3000, 2000 ల బహుమతులను కూడా ప్రదానం చేస్తున్నారు. కంప్యూటర్​, కృత్రిమ మేధా ప్రపంచంలో కూడా నిలబడే సాహితీ ప్రక్రియల్లో కథ ముందు వరుసలో ఉండి, సమజాన్ని ఉన్నతీకరిస్తుందనే నమ్మకంతోనే సాహితీ పీఠం ఈ కార్యక్రమాన్ని పవిత్రంగా నిర్వహిస్తోంది. 

_VIP3563_edited.jpg

01

 సామూహిక సంకల్పం.. 

యజ్ఞ కార్యం సమైక్యతను, సమృద్ధిని కాంక్షించి, రుగ్మతలను తొలగించినట్టు.. ఈ సాహితీ యజ్ఞంతో సమతుల్యతను, సామరస్యాన్ని పెంపొందించే కథలను ఈ పోటీ ద్వారా పాఠకుల ముందుంచుతున్నాం. లోతైన ఈ కథలు రచయిత అంతరంగాన్ని ఆవిష్కరించడమే కాక.. హోమ ధూమంలా పాఠకులందరి మనసునూ చేరుతాయి. మాకు కథలు రాస్తున్న ప్రతి రచయితా.. సరస్వతీ సన్నిధిలో అక్షర హవిస్సును సమర్పించే సాహితీ సాధకుడని చెప్పవచ్చు. పోటీలో నిలిచిన కథలు చదివి, ప్రేరణ పొంది తామూ కథలు రాయాలనే కంకణం కట్టుకుని విజేతగా నిలిచిన రచయితలున్నారు. ఇందులో పాల్గొంటున్న కొందరు రచయితలు.. పాఠకుడిగా మారి కథ చదవగలరు, విమర్శకునిగా తమ కోణాన్ని పంచుకోగలరు. విశ్లేషకునిగా కథలను విశ్లేషించనూగలరు. ఇలాంటి బహుముఖ సాహిత్య చర్చలకు, వారం వారం సమీక్షలకు, ఇష్టాగోష్ఠికి ముల్కనూరు కథా డిజిటల్ వేదిక అయిన వాట్సాప్ గ్రూప్ నాణ్యంగా నడుస్తోంది. 

mulkanooru katha 2025.jfif

02

సార్వత్రిక లక్షణం

యజ్ఞ విశిష్టత దాని సార్వత్రిక లక్షణంలో ఇమిడి ఉంటుంది. అది కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా అందరినీ ఒక తాటిపైకి తెస్తుంది. అచ్చు అలాగే ముల్కనూరు కథల పోటీ కూడా సామాజిక వైవిధ్యాన్ని గౌరవిస్తూ, సమస్త జీవరాశుల మధ్య ఐక్యతను స్థాపించడంలో తన వంతు పాత్ర పోషిస్తోంది. ఈ మహత్తర కార్యం సామాజిక నిధిలా ఉండేందుకు ఏటా కథలను సంకలనంగా తేవడం మేము మర్చిపోవడంలేదు. ఈ మా ప్రయత్నం.. పాఠకులకు ఆనందాన్ని, స్ఫూర్తిని అందిస్తూ తెలుగు సాహిత్య  లోకంలో కొత్త కుసుమాలు వికసించేలా ప్రేరణనిస్తుందని ఆశిస్తున్నాం. 

_VIP3011.jpg

నమస్తే - ముల్కనూర్‌.. కథోత్సవం!

కథలకు పట్టం... రచయితలకు ఎనలేని ప్రోత్సాహం 

Frame 69.jpg

కథ 2025

జాతీయ స్థాయి కథల పోటీ..

ఈ కథల వ్రతంలో.. ఓ రచయితది చెలియలికట్ట దాటని ఆవేశం మరో కథకుడిది కట్టలు తెంచుకున్న ఆవేదన.. ఆలోచనలకు రెక్కలు తొడిగింది ఒకరైతే .. ఆప్యాయతలకు పెద్దపీట వేసింది మరొకరు! ఈ పోటీ క్రతువులో.. అందరూ అందరే.. అక్షరాన్ని ఉపచారంగా ఎంచుకున్నవారే! భాషయాసలను నివేదనగా అర్పించినవారే!! కథల పోటీ 2025 కు  వెల్లువలా వచ్చిన వందలాది కథలను విశ్లేషించి.. అనేక దశల్లో వడబోసి.. అత్యుత్తమ కథలను ఎంపిక చేయనైనది. 

Frame 68.jpg

కథ 2023-24

ఐదు వసంతాల పవిత్ర క్రతువు..

మనం అనుకున్న గమ్యానికి ఒక్క సంవత్సరమైనా చేరుతామా? లేదా? అనే మీమాంస నుంచి ఐదు సంవత్సరాలు సాగిన అందమైన కథా ప్రయాణం మాకు గొప్ప సంతృప్తినిస్తుంది. ముల్కనూరు సాహితీ పీఠం నమస్తే తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ క్రతువుకు రచయితలే యాగ్నికులు. పాఠకులే యజమానులు. తెలుగు కథ తల్లికి మకుటాన్ని తొడగడం మాకు దక్కిన అదృష్టం. ఇది మాకెళ్లప్పుడూ చెప్పలేని ఆనందం.

Frame 67.jpg

కథ 2022

ప్రతిష్టాత్మక కథోత్సవం

2019 నుంచి ములుకనూర్ ప్రజా గ్రంథాలయం, నమస్తే తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్న వార్షిక కథల పోటీల్లో నాలుగవది. ఈ పోటీలో 70 కథలు బహుమతులకు ఎంపికైనాయి.

Frame 66.jpg

కథ 2021

నమస్తే తెలంగాణ - ముల్కనూరు కథల పోటీ

ఏటా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి కథల పోటీల్లో ఇది మూడవది. 64 కథలు విజేతగా నిలిచాయి.  ఈ పోటీకి పెద్దింటి అశోక్ కుమార్, గింజల మధుసూదన్ రెడ్డి, దేవారాజు విష్ణు వర్ధన్ రాజు, కొమఱ్ఱాజు అనంత కుమర్, కోడూరి విజయ కుమార్, గోగు శ్యామల మొదలైనవారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

Frame 64.jpg

కథ 2020

జాతీయ స్థాయి కథల పోటీ

2019 నుంచి ములుకనూర్ ప్రజా గ్రంథాలయం, నమస్తే తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్న వార్షిక కథల పోటీల్లో రెండవది. ఇందులో 50 కథలు బహుమతులకు ఎంపికైనాయి. ఈ పోటీకి నాళేశ్వరం శంకరం, జూపాక సుభద్ర, ఎగుమామిడి అయోధ్యారెడ్డి, కె. అనంత కుమార్, గింజల మధుసూదన్ రెడ్డి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

Frame 65.jpg

కథ 2019

జాతీయ స్థాయి కథల పోటీ..

ములుకనూర్ ప్రజా గ్రంథాలయం, నమస్తే తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్న కథల పోటీల్లో ఇది మొదటిది. 22 కథలు బహుమతులకు ఎంపికయ్యాయి. మధుసూదన్ రెడ్డి, కోడూరి విజయకుమార్, పెనుగొండ బసవేశ్వర్, నగేష్ బీరెడ్డి , ఇట్టేడు అర్కనందనాదేవి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

కథ సంకలనాలు
Click Cover Page to Read PDF

                              కథ సంకలనాలు

katha 2019.jpg
katha 2023-24.jpg
katha-2020.jpg
katha 2022.jpg
katha 2021.jpg
sahithi.jpg

సాహితీ పీఠ కార్యవర్గం

ధర్మకర్తలు : 

 డాక్టర్ రాజా వొజ్జల
చిదర శ్యామ్ సుందర్ 
 కోడూరి సుగుణాకర్ 
డాక్టర్ మాడిశెట్టి అశోక్ కుమార్ 
రావులపల్లి శంకర్ రావు  

సలహా మండలి 
సర్వ శ్రీ 

వేముల శ్రీనివాసులు : ముఖ్య సలహాదారు
సలహాదారులు : వంగా రవి, మూలా శ్రీనివాస్, సుద్దాల సంపత్, అయితా కిషన్ ప్రసాద్, రావుల శశిధర చారి, రావుల గిరిధర్, గింజల మధుసూదన్ రెడ్డి, కోడూరి విజయ కుమార్, ప్రొఫెసర్ కోదండరాం, పాశం  యాదగిరి, దేవరాజు విష్ణువర్ధన్ రాజు, దాసరి వెంకటరమణ, కొమర్రాజు అనంత కుమార్, వేముల రామచంద్రం

ముల్కనూరు - నమస్తే తెలంగాణ కథల పోటీల్లో విజేతగా నిలిచిన కథలు

bottom of page